సర్వాంతర్యామికేఅంగుళంలేదుచోటు..మాభూస్థలినెంతగాలించినాకానీ…!
వేలూరిశివరామశాస్త్రిగారివ్యంగ్యం– “నిష్కాసనం“
మాగృహసీమలన్నియునుమజ్జనశాలలుపాకశాలలున్
రోగపుశాలలున్మఱియురొక్కపుశాలలునింకదక్కుచో
భోగపుశాలలేఇచటబుట్టదుబెత్తెడునేలనీకునిం
దేగతివచ్చు? వచ్చినటులేగుమ!ముందరనేగుమీశ్వరా!
మీయింటియందునెమ్మయిజోటులేకుండుగాకమీయూరనెక్కడనొయుందు
నందువా? యెంతటిమందుండవింతమిక్కుటమైనవెర్రికక్కుఱితియేల?
గ్రామమధ్యంబదికలుగదా? యందువా? కరణమ్ముగారదికలుపుకొనిరి
గోష్టంబులందుండగోరుదువా? క్రొత్తలేగదూడకుగూడలేదుచోటు
బంజరెందేనిచిక్కదాప్రభువువినినజేతికరదండములుముందుచిక్కగలవు
ఇంకనెందేనిజూడుమా! యెంతవెర్రివేగుమేగుమనిలువకయీశ్వరుండ!
అక్కడమూడుతావులరుదారగనూరకయున్నవవ్వియా?
యొక్కటిక్రీస్తువారలకునొక్కటియల్లతురుష్కజాతికిన్
జిక్కెశ్మశానభూములుగశేషముమాకదిరచ్చపట్టుగా
దక్కెనునాలుగేండ్లఫలితంబదినీకెవడిచ్చుజెప్పుమా!
ఆర్యా, నమస్కారములు.
బహు చక్కటి పద్యాలు. సాధారణ మనుషులు సాధారణంగా పూజలు చేస్తారెకానీ, నిజంగా ఆ భగవంతుడు వచ్చి మీ మధ్యలో వుంటానంటే, ఆయనకు పిసరంత చోటు ఇవ్వరు; నైవేద్యం పెట్టి, తినవయ్యా అని మాటవరసకు అని, తాము ఆరగిస్తారే కానీ, నిజంగా ఆ నైవేద్యాన్ని ఆ భగవంతుడు తినేస్తే, ఏ ఒక్కరూ ఆయనకు నైవేద్యమే పెట్టరు కదా!! భగవంతుడికి నిజమైన చోటు భక్తుడి హృదయం లోనే!!
మీ స్నేహశీలి,
మాధవరావు.
చక్కని స్పందన మాధవరావు గారూ…ధన్యవాదాలు!